కరోనా: దుబాయ్ నుండి వెళ్తున్నవారికి పాస్పోర్ట్లలో వీడ్కోలు సందేశంతో స్టిక్కర్లు
- April 13, 2020_1586785131.jpg)
దుబాయ్: కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విమానాలు ఆగిపోయినప్పటి నుండి, వేలాది మంది ప్రజలు ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. దుబాయ్ ప్రవాసీయులను స్వదేశాలకు పంపుతుండటంతో ప్రజలు ఇప్పుడు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్నారు. వీరికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక చక్కని సందేశాన్ని 'ఫేర్వెల్ స్టిక్కర్' రూపంలో వారి పాస్పోర్ట్ లలో జతకలిపి వీడ్కోలు పలుకుతున్నారు.
"మీరు సురక్షితంగా ప్రయాణించాలని ఆశిస్తున్నాము...త్వరలో మళ్ళీ కలుద్దాం" అంటూ సందేశాన్ని కలిగి ఉన్న ఈ స్టిక్కర్లను దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ ప్రారంభించింది.
ప్రవాసీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు బుకింగ్లను ఏప్రిల్ 2 గురువారం నుండి అనుమతించారు. ఎమిరేట్స్ ప్రస్తుతం దుబాయ్ నుండి లండన్, బ్రస్సెల్స్, ఫ్రాంక్ఫర్ట్, పారిస్ మరియు జ్యూరిచ్లకు విమానాలను నడుపుతోంది, అయితే ప్రయాణికులు మరియు సిబ్బంది విమానంలో ప్రయాణికునికి-ప్రయాణీకునికి మధ్య ఉండాల్సిన దూరం నిబంధనలను పాటించేలా కఠినమైన విధానాలు అమలులో ఉన్నాయి. జకార్తా, మనీలా, తైపీ, చికాగో మరియు కాబూల్ లకు కొత్త విమానాలను నడుపుతున్నట్లు సోమవారం ఎయిర్లైన్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు