అమెరికాలో టోర్నాడోల బీభత్సం...12 మంది మృతి

- April 13, 2020 , by Maagulf
అమెరికాలో టోర్నాడోల బీభత్సం...12 మంది మృతి

అమెరికాలో టోర్నాడోలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆదివారం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో టోర్నాడోలు బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నాడోలతో 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మిస్సిసిప్పీలో ఏడుగురు మృతి చెందగా.. అర్కాన్సాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. టోర్నాడోల ధాటికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు 39 చోట్ల టోర్నాడోలు మహావిలయం సృష్టించాయి. లూసియానా, టెక్సాస్‌, మిసిసిప్పీ వంటి రాష్ట్రాల్లో టోర్నాడోలు విరుచుకుపడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com