బహిరంగ ప్రదేశాల్లో సమావేశం:నలుగురి అరెస్ట్
- April 13, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, నలుగురు వ్యక్తుల్ని (ఖతారీలు) అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్లో వీరంతా సమావేశం అయ్యారన్నది నిందితులపై మోపబడ్డ అభియోగం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియో ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం ప్రమాదకరం. ఈ మేరకు మినిస్ట్రీ స్పష్టమైన నిబంధనల్ని ఖరారు చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బీచ్లు, పబ్లిక్ ప్లేస్లు, రెస్టారెంట్లు అలాగే కేఫెటేరియాల వద్ద జనం గుమికూడకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







