అబుధాబి: కార్మికులకు ఉచితంగా కోవిడ్ -19 పరీక్షలు
- April 17, 2020
అబుధాబి: కరోనా కట్టడికి యావత్ ప్రపంచం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. గల్ఫ్ లో కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా సదరు ప్రభుత్వాలు కోరుతున్నాయి. అబుధాబి లోని కార్మికుల సంరక్షణ కోసం యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను అందుబాటులో ఉంచుతోంది. సమాజం యొక్క ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా అబుధాబి లోని ముస్సాఫాలో కార్మికుల కోసం ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేసారు. వీటిలో కార్మికులకు ఉచితంగా కోవిడ్ -19 పరీక్షలు నిర్వహిస్తారు.
మరీ ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు, లేదా దగ్గు, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వైరస్ లక్షణాలను ప్రదర్శించేవారు క్లినిక్లలో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సిఫారసు చేశారు. రెసిడెన్సీ వీసా లేనివారు సైతం ఈ పరీక్షలు చేయించుకునేందుకు ఎటువంటి నిబంధనలు లేవని అధికారులు ధృవీకరించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







