యూఏఈ:నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే Dh20,000 జరిమానా
- April 18, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో అసత్య ప్రచారాలకు, నిరాధారమైన వార్తల కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్న యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆరోగ్య శాఖకు సంబంధించి ఏలాంటి సమాచారాన్నైనా సరైన అధారాలు లేకుండా, అధికారులు ధృవీకరించకుండా ప్రచురితం చేసినా, ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని యూఏఈ ప్రభుత్వం హెచ్చరించింది. నిరాధారమైన ఆరోగ్య సమాచారాన్ని ప్రచురిస్తే Dh20,000 జరిమానా విధించనుంది. ఈ మేరకు యూఏఈ మంత్రి మండలి తీర్మానానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని కూడా మంత్రిమండలి స్పష్టం చేసింది. చివరకు అధికారులు కూడా ఆరోగ్యపరమైన సమాచారం విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని, అసంబద్ధమైన ప్రకటనలు చేస్తే అధికారులకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







