యూఏఈ:నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే Dh20,000 జరిమానా
- April 18, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో అసత్య ప్రచారాలకు, నిరాధారమైన వార్తల కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్న యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆరోగ్య శాఖకు సంబంధించి ఏలాంటి సమాచారాన్నైనా సరైన అధారాలు లేకుండా, అధికారులు ధృవీకరించకుండా ప్రచురితం చేసినా, ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని యూఏఈ ప్రభుత్వం హెచ్చరించింది. నిరాధారమైన ఆరోగ్య సమాచారాన్ని ప్రచురిస్తే Dh20,000 జరిమానా విధించనుంది. ఈ మేరకు యూఏఈ మంత్రి మండలి తీర్మానానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని కూడా మంత్రిమండలి స్పష్టం చేసింది. చివరకు అధికారులు కూడా ఆరోగ్యపరమైన సమాచారం విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని, అసంబద్ధమైన ప్రకటనలు చేస్తే అధికారులకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!