యూఏఈ:నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే Dh20,000 జరిమానా

- April 18, 2020 , by Maagulf
యూఏఈ:నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే Dh20,000 జరిమానా

యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో అసత్య ప్రచారాలకు, నిరాధారమైన వార్తల కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్న యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆరోగ్య శాఖకు సంబంధించి ఏలాంటి సమాచారాన్నైనా సరైన అధారాలు లేకుండా, అధికారులు ధృవీకరించకుండా ప్రచురితం చేసినా, ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని యూఏఈ ప్రభుత్వం హెచ్చరించింది. నిరాధారమైన ఆరోగ్య సమాచారాన్ని ప్రచురిస్తే Dh20,000 జరిమానా విధించనుంది. ఈ మేరకు యూఏఈ మంత్రి మండలి తీర్మానానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని కూడా మంత్రిమండలి స్పష్టం చేసింది. చివరకు అధికారులు కూడా ఆరోగ్యపరమైన సమాచారం విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని, అసంబద్ధమైన ప్రకటనలు చేస్తే అధికారులకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com