మస్కట్: పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా సోకిందన్న పుకార్లను ఖండించిన ప్రభుత్వం

- April 19, 2020 , by Maagulf
మస్కట్: పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా సోకిందన్న పుకార్లను ఖండించిన ప్రభుత్వం

మస్కట్:సుల్తానేట్ పరిధిలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా వైరస్ సోకిందన్న ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేశారు. అలాంటి ఘటనలు ఏమి చోటు చేసుకోలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పిజ్జా డెలివరీ బాయ్ వైరస్ సోకటంతో అతను డోర్ డెలివరీ చేసిన 72 కుటుంబాలను నిర్బంధంలోకి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం కాస్త ప్రభుత్వ అధికారుల వరకు చేరటంతో..ప్రజల్లో నెలకొన్న అపోహలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. సుల్తానేట్ పరిధిలోని పిజ్జా డెలివరీ బాయ్ కి వైరస్ ఉన్న కేసులేవి తమ దృష్టికి రాలేదని, ఇది ఇతర దేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన వార్త అని కూడా స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com