ఫేస్ మాస్క్ నిబంధనలను ఉల్లంఘించిన 100 మంది పై చర్యలు
- April 19, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని అధికారులు ఎంతగా చెప్పినా కొందరు ఆ సూచనలు పట్టించుకోవటం లేదు. వైరస్ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తూ మాస్కులు లేకుండానే యథేచ్చగా రోడ్ల మీదకు వస్తున్నారు. బహ్రెయిన్ లో మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న దాదాపు వంద మందిని అధికారులు పట్టుకున్నారు. మాస్కులు ధరించాలన్న నిబంధనలు పాటించని వారిపై తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాన ప్రజా భద్రతా అధికారి లెఫ్టినెంట్ జనరల్ తరీఖ్ అల్ హస్సన్ వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని..వాటిని తప్పకుండా పాటించాలని ఆయన హెచ్చరించారు. వీలైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఒకవేళ అత్యవసరంగా బయటికి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన మరోసారి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు