స్పెయిన్:2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- April 20, 2020
మాడ్రిడ్:స్పెయిన్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకి అక్కడ కేసుల సంఖ్య బారీగా పెరుగుతోంది. స్పెయిన్ లో కరోనా బారిన పడినవారి సంఖ్య రెండు లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 4,266 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఒక్క రోజే కరోనా బారిన పడి 399 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 20,852కు చేరింది. ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులున్న రెండో దేశం స్పెయినే కావడం గమనార్హం. ప్రస్తుతం స్పెయిన్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 200210కి చేరింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







