కోవిడ్ 19: మస్కట్ లో లాక్ డౌన్ పొడిగింపు
- April 21, 2020
మస్కట్:కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మస్కట్ లో లాక్ డౌన్ నిబంధనలను పొడిగిస్తూ సుప్రీం కమిటీ నిర్ణయం తీసుకుంది. మే 8 వరకు గవర్నరేట్ పరిధిలో ప్రస్తుత భద్రత ఏర్పాట్లు, చెక్ పోస్టు దగ్గర తనిఖీలు కొనసాగుతాయని కమిటీ స్పష్టం చేసింది. వైరస్ ప్రాబల్యం తగ్గకపోవటం వల్లే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కోవిడ్ 19 నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ వెల్లడించింది. మే 8 శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇదిలాఉంటే భౌతిక దూరం పాటించేందుకు రమాదాన్ మాసంలో ఎవరూ సామూహిక ప్రార్ధనలు నిర్వహించొద్దని కూడా సుప్రీం కమిటీ సూచించింది. అలాగే ఇఫ్తార్ విందు తరహా కర్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







