కోవిడ్ 19: మస్కట్ లో లాక్ డౌన్ పొడిగింపు

- April 21, 2020 , by Maagulf
కోవిడ్ 19: మస్కట్ లో లాక్ డౌన్ పొడిగింపు

 మస్కట్:కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మస్కట్ లో లాక్ డౌన్ నిబంధనలను పొడిగిస్తూ సుప్రీం కమిటీ నిర్ణయం తీసుకుంది. మే 8 వరకు గవర్నరేట్ పరిధిలో ప్రస్తుత భద్రత ఏర్పాట్లు, చెక్ పోస్టు దగ్గర తనిఖీలు కొనసాగుతాయని కమిటీ స్పష్టం చేసింది. వైరస్ ప్రాబల్యం తగ్గకపోవటం వల్లే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కోవిడ్ 19 నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ వెల్లడించింది. మే 8 శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇదిలాఉంటే భౌతిక దూరం పాటించేందుకు రమాదాన్ మాసంలో ఎవరూ సామూహిక ప్రార్ధనలు నిర్వహించొద్దని కూడా సుప్రీం కమిటీ సూచించింది. అలాగే ఇఫ్తార్ విందు తరహా కర్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com