భారత్ లో 24 గంటల్లో 47మృతులు
- April 21, 2020
కరోనా కట్టడికి భారత్లో దాదాపుగా నెల రోజుల నుంచి లాక్డౌన్ కొనసాగుతుంది. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 1,336 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 18,601కి చేరుకుంది. 24 గంటల్లో మరణించిన వారి సంఖ్య 47 నమోదు కావడంతో మరణాల సంఖ్య 590కి చేరింది. ఇక వీటితో పాటు రికవరీ సంఖ్య కూడా పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకు చికిత్స అనంతరం కోలుకుని ఇళ్లకు చేరిన వారి సంఖ్య 3251గా నమోదైంది. దేశం మొత్తంలో వైరస్ బారిన పడుతున్న వారు మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, మధ్య ప్రదేశ్ ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







