యూఏఈ:నకిలీ ఫేస్ మాస్కులు, శానిటైజర్లు అమ్ముతున్న ప్రవాసీయుడి అరెస్ట్
- April 21, 2020
యూఏఈ :నకిలీ ఫేస్ మాస్కులు, క్రిమి సంహారక రసాయనాలు(శానిటైజర్స్)ను అమ్ముతున్న ఏసియన్ వ్యక్తిని షార్జా మున్సిపాలిటీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. అతని నుంచి 1,800 నకిలీ శానిటైజర్లు, వెయ్యి మాస్కులు, 200 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. షార్జా మున్సిపాలిటి పరిధిలోనే ఉండి ప్రవాసీయుడు తన ఇంట్లో ఓ గదిని స్టోర్ రూంగా మార్చుకొని ఈ నకిలీ ఐటమ్స్ ని మార్కెట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫేక్ మాస్కులు, శానిటైజర్లను రవాణా చేసేందుకు ఇంటి ముందు బాక్సులతో అతను సిద్ధంగా ఉన్న సమయంలోనే మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అతని నుంచి బాక్సులను స్వాధీనం చేసుకొని వెంటనే పోలీసులకు, ఎమిరాతికి చెందిన ఆర్ధిక అభివృద్ధి విభాగం అధికారులకు సమాచారం అందించారు. నకిలీ సామాగ్రి మార్కెట్ చేస్తున్న ఆరోపణలపై అతనికి భారీగా జరిమానా విధించారు. అలాగే అక్రమ రవాణాకు వాహనాన్ని ఉపయోగించటం, ఇంటిని స్టోర్ రూంగా వాడుకున్నందుకు అదనంగా ఫైన్ విధించారు. ప్రజలకు హాని కలిగించే ఇలాంటి చర్యలను తాము అసలు ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. అదీ కూడా ప్రస్తుతం కరోనా విపత్తు సమయంలో ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిని కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







