కువైట్:మే 28 వరకు రమదాన్ సెలవులు..16 గంటలు పాక్షిక కర్ఫ్యూ
- April 21, 2020
కువైట్:రమదాన్ మాసానికి సంబంధించి కర్ఫ్యూ సమయాలను, జాతీయ సెలవు రోజుల వివరాలను కువైట్ ప్రకటించింది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించింది. అలాగే రమదాన్ సందర్భంగా జాతీయ సెలవులను మే 28 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఆదేశాల మేరకు మే 28 వరకు సెలవులు పొడిగించాలని...తిరిగి మే 31, ఆదివారం నుంచి పని దినాలను ప్రారంభించాలని పేర్కొన్నారు. ఇక కరోనా కట్టడికి రమదాన్ మాసంలోనూ కర్ఫ్యూని పొడగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే..రంజాన్ సందర్భంగా రెస్టారెంట్లు, ఫుడ్ స్టోర్స్ కి మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెస్టారెంట్లు, ఫుడ్ స్టోర్స్ నుంచి హోమ్ డెలివరీలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







