కువైట్:మే 28 వరకు రమదాన్ సెలవులు..16 గంటలు పాక్షిక కర్ఫ్యూ
- April 21, 2020
కువైట్:రమదాన్ మాసానికి సంబంధించి కర్ఫ్యూ సమయాలను, జాతీయ సెలవు రోజుల వివరాలను కువైట్ ప్రకటించింది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించింది. అలాగే రమదాన్ సందర్భంగా జాతీయ సెలవులను మే 28 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఆదేశాల మేరకు మే 28 వరకు సెలవులు పొడిగించాలని...తిరిగి మే 31, ఆదివారం నుంచి పని దినాలను ప్రారంభించాలని పేర్కొన్నారు. ఇక కరోనా కట్టడికి రమదాన్ మాసంలోనూ కర్ఫ్యూని పొడగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే..రంజాన్ సందర్భంగా రెస్టారెంట్లు, ఫుడ్ స్టోర్స్ కి మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెస్టారెంట్లు, ఫుడ్ స్టోర్స్ నుంచి హోమ్ డెలివరీలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







