కోవిడ్19 :కంపెనీలు, యజమానులు కార్మికులకు తప్పనిసరిగా ఆరోగ్య భీమా కల్పించాల్సిందే

- April 21, 2020 , by Maagulf
కోవిడ్19 :కంపెనీలు, యజమానులు కార్మికులకు తప్పనిసరిగా ఆరోగ్య భీమా కల్పించాల్సిందే

దుబాయ్:కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి సంస్థ, కంపెనీ, యజమానులు తమ కార్మికులకు తప్పనిసరగా ఆరోగ్య బీమా చేయించాల్సిందేనని దుబాయ్ ఆరోగ్య భీమా సంస్థ సీఈవో సలెహ్ అల్ హషిమి ప్రకటించారు. ఆరోగ్య భీమా చట్టం నెం.11, 2013 ప్రకారం ప్రతి యజమాని, స్పాన్సర్ భీమా కల్పించటం తప్పనిసరి అని గుర్తు చేశారు. ఈ మేరకు ఉద్యోగులు, కార్మికుల భీమా కల్పించటం, రెన్యూవల్ చేయటం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చాలని అన్నారు.  ప్రస్తుత విపత్కర పరిస్థితులను మేం క్షణ్ణంగా గమనిస్తున్నాం, సంస్థలు ఎదుర్కుంటున్న సవాళ్లను గుర్తించాము. అయినా..ఉద్యోగులకు భీమా కల్పించటం అనేది కనీస బాధ్యతని, తద్వారా వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని దుబాయ్ ఆరోగ్య బీమా సంస్థ అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com