దుబాయ్:నగదు బదిలీ, మెయింటనెన్స్ సర్వీసులకు లాక్ డౌన్ నుంచి పాక్షిక మినహాయింపు
- April 22, 2020
దుబాయ్:లాక్ డౌన్ నిబంధనల నుంచి విడత వారీగా కొన్ని రంగాలకు మినహాయింపు ఇస్తున్నారు దుబాయ్ అధికారులు. ఇటీవలె మాంసం, కూరగాయలు, టీ, స్వీట్ షాపులకు సడలింపు ఇచ్చిన అధికారులు తాజాగా..నగదు బదిలీ ఆఫీసులు, ఇళ్లలో మెయింటనెన్స్ సర్వీస్ రంగాలకు సంబంధించి పాక్షిక మినహాయింపులను ప్రకటించింది. ఇక నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగదు బదిలీ ఆఫీసులు తెరిచిఉంచేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే బిల్డింగ్ నిర్వహణ, ఏసీ, కూలింగ్ ఈక్విప్ మెంట్ రిపేర్ సర్వీసులకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో రాత్రి 8 తర్వాత కూడా సర్వీసు అందించవచ్చని సూచించింది. అయితే..ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటంతో పాటు సామాజిక దూరాన్నిపాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







