రమదాన్: మాస్క్లలో ప్రార్థనలకు అనుమతి లేదు
- April 27, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, కాల్ అండ్ గైడెన్స్, మాస్క్లలో ప్రార్థనలకు అనుమతివ్వడం జరిగిందంటూ చోటు చేసుకున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మినిస్ట్రీ ఖండించింది. కరోనా వైరస్ నేపథ్యంలో మినిస్ట్రీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపిన అధికారులు, అవే ఆదేశాలకు కట్టుబడి వున్నట్లు స్పష్టం చేసింది. మాస్క్లలో సామూహిక ప్రార్థనలు వంటి వాటిని తాత్కాలికంగా రద్దు చేస్తూ మినిస్ట్రీ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే, రమదాన్ సందర్భంగా వెసులుబాట్లు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. కాగా, పవిత్ర మసీదుల్లో అక్కడి సిబ్బంది ప్రత్యేక ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ప్రజలంతా తమ ఇళ్ళ వద్దనే రమదాన్ ప్రత్యేక ప్రార్థనల్ని కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు