మూడు స్టోర్స్ని సీజ్ చేసిన మినిస్ట్రీ
- April 27, 2020
కువైట్:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మూడు స్టోర్స్ని సీజ్ చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో విధించిన నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఈ స్టోర్స్పై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీకి చెందిన టీమ్స్, 182 కన్స్యుమర్ కో-పరేటివ్స్పై సోదాలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్, వెజిటబుల్ స్టోర్స్లపైనా తనిఖీలు నిర్వహించారు. ధరలు సహా అనేక అంశాలకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ఫుడ్ రేషన్స్ డెలివరీ అలాగే 64 రేషనింగ్ సెంటర్స్ని కూడా తనిఖీలు చేశారు. కాగా, మినిస్ట్రీకి చెందిన ఎమర్జన్సీ సెంటర్ 231 ఫిర్యాదుల్ని హాట్లైన్ 135 ద్వారా అందుకోవడం జరిగింది. సూపర్విజన్ సెంటర్కి 30 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, 127 రేషన్ కార్డుల్ని రెన్యూవల్ చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







