కరోనా వైరస్: ఇండియన్ డాక్టర్కి దుబాయ్ పోలీసుల సెల్యూట్
- April 28, 2020
దుబాయ్ :దుబాయ్లో ఓ ఇండియన్ డాక్టర్కి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ అయేషా సుల్తానా తన విధుల్ని ముగించుకుని, ఇంటికి వెళుతున్న సమయంలో దుబాయ్ పోలీస్ ఆమెను ఆపడం జరిగింది. ఆమె, తన వద్దనున్న డాక్యుమెంట్స్ని పోలీసులకు చూపించారు. అయితే, ఆమె డాక్టర్ అని తెలుసుకున్న పోలీసులు, డాక్యుమెంట్స్ తనిఖీలు చేయకుండానే ముందుకు వెళ్ళమని సూచించారు. అంతే కాకుండా, ఆ డాక్టర్కి పోలీసులంతా సెల్యూట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘యూఏఈ నివాసితురాలిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ గౌరవానికి నేను ఉప్పొంగిపోతున్నాను..’ అని ఆమె పేర్కొన్నారు. కాస్సేపు తన కళ్ళు చెమర్చాయనీ, అంతలా పోలీసుల సెల్యూట్ తనను కదిలించిందని చెప్పారామె. కాగా, ఫ్రంట్ లైన్ వారియర్స్లా కోవిడ్-19పై పోరాటంలో పనిచేస్తున్న డాక్టర్లకు యూఏఈలో ప్రత్యేక గౌరవం దక్కుతోంది.
----బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







