తెలంగాణ కాంగ్రెస్ వీడియో కాన్ఫరెన్స్
- April 29, 2020
దుబాయ్: TPCC టాస్క్ ఫోర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవాసీయుల సమస్యల పరిష్కారం కొరకు ఒక సుధీర్ఘ ఆలోచనతో ఒక నిర్దిష్ట ప్రణాళికను ఎర్పాటు చేయుటకు పూర్తి అనుభవము ఉన్న అన్ని రాష్ట్రాల వారికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నవారు M.శశీధర్ రెడ్డి(TPCC టాస్క్ఫోర్స్ చైర్మన్ కోవిడి- 19), B.M వినోద్ కుమార్(TPCC వైస్ ప్రెసిడెంట్), నిరంజన్ గోపిశెట్టి(TPCC టాస్క్ఫోర్స్ కన్వీనర్) ,ఎస్వీ రెడ్డి (TPCC NRI సెల్ కన్వీనర్ దుబాయ్), వినోద్ మీనన్(కేరళ ప్రభుత్వ సలహాదారు), ముస్తఫా(నార్కొడైరెక్టర్ కేరళ, దుబాయ్).ఈ కార్యక్రమంలో ప్రవాసీయుల కష్టాల సుధీర్ఘ పరిస్కారము కొరకు చర్చిండం జరిగింది.
ముఖ్యంగా గల్ఫ్ కార్పొరేషన్ తయారు చెయ్యడానికి ఒక శాఖ ఎర్పాటు చెయ్యడానికి గల సలహాలు చర్చించడం జరిగింది. వివరాల్లోకి వెళితే ముఖ్యంగా గల్ఫ్ లో కూలీలుగా పనిచేస్తూ ఇబ్బందులు పడె వారికి వారు తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చిన తరువాత వారి జీవోనో పాదికి ప్రభుత్యం ఏలాంటి సహాయం అందించాలి మరియు చిన్న వ్యాపారాలు చేసి తిరిగి మన దేశానికి వచ్చాక ప్రభుత్వం సహాయం చెయ్యాలి.
గల్ఫ్ దేశాలలో జైల్లో ఉన్న వారిని తిరిగి మన దేశానికి తీసుకురావడానికి తగిన చర్యలు త్వరగా తీసుకోవడం, ముఖ్యంగా ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల గల్ఫ్ లో చిక్కుకున్న వారిని తీసుకు రావడానికి కావాల్సిన చర్యలు, సూచనలు అన్ని రాయబార కార్యాలయలకు వినతి పత్రాలు అందచేసి వచ్చే వారికి ఒక వెబ్ సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకునేలా ఒక ప్లాన్ ఎర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అన్ని రాయబార కార్యాలయాలకు ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మీద మరింత ఒత్తిడి తెచ్చి అన్ని అమలు అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని M.శశిధర్ రెడ్డి మరియు ఎన్నో దేశాల్లో ప్రభుత్వ రాయబారిగా పని చేసిన వినోద్ కుమార్ మరియు ఎస్వీ రెడ్డి అందరూ కలిసి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







