మస్కట్ః ఒమన్‌ లో ప్రవాసీయులకు షాక్‌..ప్రభుత్వ సంస్థల్లో ఒమనైజేషన్‌ షురూ

- April 30, 2020 , by Maagulf
మస్కట్ః ఒమన్‌ లో ప్రవాసీయులకు షాక్‌..ప్రభుత్వ సంస్థల్లో ఒమనైజేషన్‌ షురూ

మస్కట్:ఒమన్‌ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ప్రవాసీయులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఒమనైజేషన్‌ లో భాగంగా ఇక నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవాస ఉద్యోగుల స్థానంలో ఒమనీస్‌ ను భర్తీ చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించబోతోంది. ప్రవాసీయుల స్థానంలో ఒమనీస్‌ ను భర్తీ చేయటం ద్వారా సుల్తానేట్‌ అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వం చెబుతోంది. వీలైనంత వేగంగా ఈ భర్తీ ప్రక్రియ చేపట్టాలని కూడా ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్‌ నెంబర్‌ 14, 2020లో స్పష్టంగా ఆదేశించినట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించేలా ఒమనీస్‌ కు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా ఆర్ధిక శాక వివరించింది. ఒమనైజేషన్‌ ను అమలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచే ప్రారంభించేందుకు తగినంత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ సంస్థల్లో క్వాలిఫైడ్‌ ఒమనీస్‌ తగిన ఉద్యోగం ఇచ్చే అనువైన వాతావరణం ఉంటుందని ఆర్ధిక శాఖ అభిప్రాయపడింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com