స్టాంప్డ్ వర్క్ వీసా ఫీజు రిఫండ్ చేయనున్న సౌదీ
- April 30, 2020
రియాద్: సౌదీ అరేబియా, వర్క్ వీసా ఫీజుని రిఫండ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. స్టాంపింగ్(ముద్రణ) అయ్యాక కూడా కింగ్డమ్కి రాలేనివారి కోసం ఈ ప్రక్రియ చేపడుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడిన దరిమిలా సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ సంయుక్తంగా దీనికి సంబంధించిన మెకానిజంని ప్రారంభించడం జరిగింది. మార్చి 18న విడుదల చేసిన రాయల్ డిక్రీ నేపథ్యంలో ఈ క్యాన్సిలేషన్ - రిఫండింగ్ అనేది పరిశీలనలోకి వచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేందుకోసం ప్రపంచంలోని పలు దేశాల్లోని సౌదీ డిప్లమాటిక్ మిషన్స్ వీసాలను జారీ చేయడం జరిగింది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోవడంతో వీసా రుసుములు రిఫండ్ చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?