దుబాయ్ : నిబంధనలు పాటించని 19 షాపుల సీజ్..118 షాపు యజమానులకు వార్నింగ్
- May 01, 2020కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నిబంధనల అమలు తీరుపై తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా దుబాయ్ ఆర్ధిక శాఖ విభాగం అధికారులు పలు షాపింగ్ మాల్స్, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మాస్కులు, గ్లౌజ్, సామాజిక దూరం పాటించకపోవటం ఇలా పలు నిబంధనలు పాటించని 19 షాపులను సీజ్ చేశారు. మరో 118 షాపు ఓనర్లకు నోటీసుల ద్వారా మందలించారు. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు సమయంలోనూ కరోనా వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు మార్గనిర్దేశకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి షాపు నిర్వాహకులు మాస్కులు, చేతికి గ్లౌజులు విధిగా ధరించాలి. అలాగే స్టోర్స్ లో కస్టమర్లను గుంపులుగా అనుమతించకుండా సామాజిక దూరాన్ని అమలు చేయాలి. ఈ నిబంధనలు ఎంతవరకు అమలు అవుతున్నాయో పరిశీలించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. 432 షాపులలో మాత్రం మార్గనిర్దేశకాలను పాటిస్తున్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం