ఖతార్ : కాలం చెల్లిన ఆహారపదార్ధాలను అమ్ముతున్న ముఠా అరెస్ట్

- May 01, 2020 , by Maagulf
ఖతార్ : కాలం చెల్లిన ఆహారపదార్ధాలను అమ్ముతున్న ముఠా అరెస్ట్

గడువు ముగిసిన తినుబండారాలను రీప్యాక్ చేసి అక్రమంగా మార్కెట్ కు సరఫరా చేస్తున్న ముఠాను ఖతార్ పోలీసులు అరెస్ట చేశారు. వాక్రాలోని ఓ ఇంటిని కేంద్రంగా చేసుకొని ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్దాల పొట్లాలను మళ్లీ ప్యాక్ చేసి మార్కెట్ కు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాక్రా ప్రాంతంలో రైడ్ చేశారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఫుడ్ స్టఫ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com