రొయ్యల పులిహోర
- January 28, 2016
కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు (పొట్టు తీసి శుభ్రం చేసినవి) - అరకిలో (చిన్న సైజువి), వేగించిన ధనియాలపొడి - 1 టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, బియ్యం - అరకిలో, నూనె - అరకప్పు, చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 5, శనగలు (నానబెట్టినవి) - 1 టేబుల్ స్పూను, మెంతులు - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, పసుపుపొడి - అర టీ స్పూను, కరివేపాకు రెబ్బలు -10, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం : రొయ్యలను ఉడికించి నీరు లేకుండా ఆరబెట్టి వాటికి ధనియాల, మిరియాల పొడులతో పాటు తగినంత ఉప్పు పట్టించి పక్కనుంచుకోవాలి. మూడు కప్పుల (గోరువెచ్చటి) నీటిలో చింతపండు నానబెట్టి పులుసు తయారు చేసుకోవాలి. అన్నం (కాస్త పలుకుగా) వండి చల్లార్చుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఎండుమిర్చి, ఆవాలు, శనగలు, కరివేపాకు వేసి నూనెలో దోరగా వేగించి ఆపైన రొయ్యలు కూడా వేసి కాస్త వేగనిచ్చి చింతపండు పులసు కలిపి, ఉప్పును జతచేసి బాగా చిక్కబడేదాకా సన్నని మంటపై ఉడకనివ్వాలి. పులుసు బాగా చల్లారనిచ్చి కొద్దికొద్దిగా అన్నంలో కలపాలి. పులిహోర ముద్ద ముద్దకు ఒక రొయ్య తగిలేలా చూసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









