రొయ్యల పులిహోర

- January 28, 2016 , by Maagulf
రొయ్యల పులిహోర

కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు (పొట్టు తీసి శుభ్రం చేసినవి) - అరకిలో (చిన్న సైజువి), వేగించిన ధనియాలపొడి - 1 టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, బియ్యం - అరకిలో, నూనె - అరకప్పు, చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 5, శనగలు (నానబెట్టినవి) - 1 టేబుల్‌ స్పూను, మెంతులు - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, పసుపుపొడి - అర టీ స్పూను, కరివేపాకు రెబ్బలు -10, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం : రొయ్యలను ఉడికించి నీరు లేకుండా ఆరబెట్టి వాటికి ధనియాల, మిరియాల పొడులతో పాటు తగినంత ఉప్పు పట్టించి పక్కనుంచుకోవాలి. మూడు కప్పుల (గోరువెచ్చటి) నీటిలో చింతపండు నానబెట్టి పులుసు తయారు చేసుకోవాలి. అన్నం (కాస్త పలుకుగా) వండి చల్లార్చుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఎండుమిర్చి, ఆవాలు, శనగలు, కరివేపాకు వేసి నూనెలో దోరగా వేగించి ఆపైన రొయ్యలు కూడా వేసి కాస్త వేగనిచ్చి చింతపండు పులసు కలిపి, ఉప్పును జతచేసి బాగా చిక్కబడేదాకా సన్నని మంటపై ఉడకనివ్వాలి. పులుసు బాగా చల్లారనిచ్చి కొద్దికొద్దిగా అన్నంలో కలపాలి. పులిహోర ముద్ద ముద్దకు ఒక రొయ్య తగిలేలా చూసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com