కరోనా వైరస్‌పై పోరాటం: దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ వార్నింగ్‌

- May 06, 2020 , by Maagulf
కరోనా వైరస్‌పై పోరాటం: దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ వార్నింగ్‌

దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌, మోసగాళ్ళ విషయంలో భారత జాతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. రీపాట్రియేషన్‌ ప్లాన్స్‌కి సంబంధించి మోసగాళ్ళు పొంచి వుంటారనీ, వారి పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది ఇండియన్‌ కాన్సులేట్‌. స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకునేవారు తమ వివరాలు చెప్పాలని కోరుతూ, బ్యాంక్‌ డిటెయిల్స్‌ అలాగే ఓటీపీ అడుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆయా విమానయాన సంస్థలకు మాత్రమే నిర్ధారిత మొత్తాల్లో టిక్కెట్‌ ధరలు చెల్లించాల్సి వుంటుందనీ, మద్యవర్తులకు అస్సలేమాత్రం ఆస్కారమివ్వవద్దనీ, మే 7 నుంచి మాత్రమే రీపాట్రియేషన్‌ కోసం విమానాలు పనిచేస్తాయని తెలిపారు అధికారులు. ఎయిర్‌ ఇండియా, ఈ ప్రత్యేక విమానాల్ని నడుపుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com