ఐదుగురికంటే ఎక్కువ గుమికూడటంపై నిషేధం

- May 08, 2020 , by Maagulf
ఐదుగురికంటే ఎక్కువ గుమికూడటంపై నిషేధం

జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, కరోనా వైరస్‌కి సంబంధించి కొత్త రెగ్యులేషన్స్‌ని ప్రకటించింది. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడటాన్ని నిషేధిస్తూ ఓ రెగ్యులేషన్‌ని పొందుపర్చింది తాజాగా. రెగ్యులేషన్స్‌ని ఉల్లంఘిస్తే 5,000 సౌదీ రియాల్స్‌ నుంచి 100,000 సౌదీ రియాల్స్‌ వరకూ జరీమానాలు విధిస్తారు. కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు ఇలా గుమి కూడితే చర్యలు తీసుకుంటారు. ఇల్లీగల్‌ గేదరింగ్‌కి పాల్పడినవారికి 5,000 సౌదీ రియాల్స్‌ జరీమానా. ఉల్లంఘన తాలూకు తీవ్రతను బట్టి ఈ జరీమానా పెరుగుతూ వుంటుంది. ఉల్లంఘనలకు పదే పదే పాల్పడుతోంటే మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇల్లీగల్‌ గేదరింగ్‌కి ఆస్కారమిచ్చే ప్రైవేట్‌ సెక్టార్‌ ఫెసిలిటీస్‌పై మూడు నెలల మూసివేత విధిస్తారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌ ఎప్పటికప్పుడు ఈ గేదరింగ్స్‌పై తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,731కి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com