కువైట్ నివాసితులకు షాక్...
- May 08, 2020
కువైట్ లో స్థిరపడ్డ భారతీయులను ఇక్కడ నుంచి స్వదేశానికి తరలించే ప్రక్రియ కుంటుపడింది. వందేభారత్ మిషన్ లో భాగంగా భారతీయులను స్వదేశానికి శుక్రవారం నుంచి పంపాలన్న నిర్ణయం అమలులో జాప్యం జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం అనుకున్న సమయానికి కువైట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి కువైట్ నుంచి 5 విమాన సర్వీసులు హైదరాబాద్, కొచ్చి, చెన్నై, అహ్మదాబాద్, కోజికోడ్ లకు పంపాల్సి ఉంది. అయితే ఇప్పటికీ దానికి సంబంధించిన అనుమతి రాలేదు. అక్రమంగా నివసిస్తున్న వేలాదిమంది భారతీయులను తమదేశానికి తిరిగి తీసుకువెళ్లాలని గతంలోనే భారత ప్రభుత్వాన్ని కువైట్ కోరింది. అయితే, ఇప్పటికీ భారత్ నుంచి ప్రతిస్పందన రాలేదని కువైట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం