మాలే నుంది ఇండియాకు మరో నౌక

- May 09, 2020 , by Maagulf
మాలే నుంది ఇండియాకు మరో నౌక

సముద్ర సేతు కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల నుండి కొచ్చి బయలుదేరడానికి సిద్ధంగా  మరో భారత నావికాదళ ఓడ...

మాల్దీవులు: విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమం 'సముద్ర సేతు'. ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల నుండి రెండు నౌకలలో సుమారు వెయ్యి మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు నియమించారు. సముద్ర సేతు కార్యక్రమంలో భాగంగా మొదటి ఓడ ఐఎన్ఎస్ జల్ష్వా నిన్న సాయంత్రం 'మాలే' నుండి 19 మంది గర్భిణీ స్త్రీలు మరియు 14 మంది పిల్లలతో సహా 698 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ నౌక రేపు ఉదయం కొచ్చి చేరుకుంటుంది. 

రెండవ నౌక ఐఎన్ఎస్ మాగర్ సుమారు 200 మంది ప్రయాణికులతో మాలే నుండి రేపు బయలుదేరనుంది. మాలేలోని భారత హైకమిషన్ ప్రయాణికుల తుది జాబితా ఖరారు చేయడంలో బిజీగా ఉంది. కొచ్చి లో ప్రయాణీకులను చేర్చిన అఞ్ఞతరం ఈ రెండు నౌకలు; ఐఎన్ఎస్ జలాష్వా మరియు ఐఎన్ఎస్ మాగర్ లు టుటికోరిన్ కు పయనమై అక్కడి ప్రవాసీయులను స్వదేశానికి చేర్చే కార్య్రక్రమాన్ని చేపట్టనున్నాయి. దీనికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి అని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com