మాలే నుంది ఇండియాకు మరో నౌక
- May 09, 2020
సముద్ర సేతు కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల నుండి కొచ్చి బయలుదేరడానికి సిద్ధంగా మరో భారత నావికాదళ ఓడ...
మాల్దీవులు: విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమం 'సముద్ర సేతు'. ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల నుండి రెండు నౌకలలో సుమారు వెయ్యి మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు నియమించారు. సముద్ర సేతు కార్యక్రమంలో భాగంగా మొదటి ఓడ ఐఎన్ఎస్ జల్ష్వా నిన్న సాయంత్రం 'మాలే' నుండి 19 మంది గర్భిణీ స్త్రీలు మరియు 14 మంది పిల్లలతో సహా 698 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ నౌక రేపు ఉదయం కొచ్చి చేరుకుంటుంది.
రెండవ నౌక ఐఎన్ఎస్ మాగర్ సుమారు 200 మంది ప్రయాణికులతో మాలే నుండి రేపు బయలుదేరనుంది. మాలేలోని భారత హైకమిషన్ ప్రయాణికుల తుది జాబితా ఖరారు చేయడంలో బిజీగా ఉంది. కొచ్చి లో ప్రయాణీకులను చేర్చిన అఞ్ఞతరం ఈ రెండు నౌకలు; ఐఎన్ఎస్ జలాష్వా మరియు ఐఎన్ఎస్ మాగర్ లు టుటికోరిన్ కు పయనమై అక్కడి ప్రవాసీయులను స్వదేశానికి చేర్చే కార్య్రక్రమాన్ని చేపట్టనున్నాయి. దీనికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్, కువైట్ అమీర్ చ�
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







