బహ్రెయిన్:వ్యక్తిగత తగాదాలతో సోదరుడిపై దాడి..మూడో అంతస్తుపై నుంచి నెట్టివేత
- May 12, 2020
మనామా:మూడో అంతస్తు నుంచి వ్యక్తిని తోసివేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఈ నెల 31న క్రిమినల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సోదరుల మధ్య తలెత్తిన వ్యక్తిగత వివాదంలో ముగ్గురు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిని మూడో అంతస్తు నుంచి తోసివేశారనే ఆరోపణలతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే..బాధితుడు గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో బాధితుడితో ఉన్న అతని స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం..తాము తమ ఫ్లాట్ లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు బలవంతంగా తమ ఫ్లాట్ లోకి చొచ్చుకొచ్చారని, వాళ్లు అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్లు అతను చెబుతున్నాడు. ఫ్లాట్ లోకి చొచ్చుకొచ్చిన వెంటనే దాడికి ప్రయత్నించటంతో బాధితుడు పై అంతస్తులోకి పారిపోయాడని..అతనిని వెంబడించిన నిందితులు మూడో ఫ్లోర్ కు చేరుకోగానే అక్కడి నుంచి అతన్ని కిందకు తోసివేసినట్లు చెబుతున్నాడు. అంతేకాదు..దాడి జరిగిన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా వెల్లడించాడు. దాడికి పాల్పడిన వారిలో ఒకరు బాధితుడికి సోదరుడని..ఆస్తి తగాదా విషయంలో దాడి జరిగినట్లు వెల్లడించాడు. బాధితుడి స్నేహితుడి ఫిర్యాదుతో నిందితులు ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి న్యాయవిచారణకు సిఫార్సు చేశారు. ఈ కేసులో ఈ నెల 31న క్రిమినల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







