తెలంగాణా జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

- May 12, 2020 , by Maagulf
తెలంగాణా జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

దోహా:తెలంగాణా జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం,దోహా ఖతర్ లో కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి పని లేక, జీతం లేక తినడానికి తిండి లేక అవస్థ పడుతున్న కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల చెందిన 15 మంది వలస కార్మికులకు కవిత గారి ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఖతర్ నాయకులు హరికా ప్రేమ్, స్వప్న కేశా, శ్రీకాంత్ కొమ్ముల,ఎల్లయ్య తాళ్ళపెళ్లి మరియు సంజయ్ థామస్,శ్రావణి కొండోజు గార్ల సహకారంతో నిత్యావసర సామగ్రిని అందజేయడం జరిగింది.

కరోనా వల్ల కార్మికులు తీవ్ర భయాందోళన కు లోనవుతున్నారని, తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణా వలస కార్మికుల ను వెనక్కు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com