భారత్:కరోనా.. 24 గంటల్లో 100 మంది మృతి

- May 15, 2020 , by Maagulf
భారత్:కరోనా.. 24 గంటల్లో 100 మంది మృతి

కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయనుకున్నా మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 82 వేలకు చేరుకుంది. నిన్న ఒక్క రోజే కొత్త కేసులు 3,967 నమోదు కాగా, 100 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2,649 కి చేరుకుంది. ఇక చికిత్స తీసుకుని కోలుకున్న వారి సంఖ్య 27,920 మంది కాగా, చికిత్స పొందుతున్న వారు 51,401 మంది ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినా మహరాష్ట్ర, గుజరాత్‌లలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com