ఒమన్ లో భౌతిక దూరం పాటించకుండా గుమికూడిన వ్యక్తుల అరెస్ట్
- May 15, 2020
ఒమన్:కరోనా వ్యాప్తి నియంత్రణకు భౌతిక దూరం పాటించాలని అధికారులు ఎంతగా చెబుతున్నా..కొందరు జనాలు మాత్రం తీరు మార్చుకోవటం లేదు. ఒమన్ లోని నార్త్ అల్ షర్ఖియా ప్రాంతంలో కొంతమంది భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా ఒకే చోట గుమికూడారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి..న్యాయ విచారణకు కేసును బదిలీ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సుప్రీం కమిటీ పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు మినహా ఇతరులు ఎవరూ ఒకే చోట గుమికూడొద్దని నిబంధనలు విధించింది. అయినా..కొందరు జనం ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో పోలీసులు అలాంటి వారికి కట్టడి చేసే పనిలో ఉన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని, లేకపోతే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







