ఒమన్ లో భౌతిక దూరం పాటించకుండా గుమికూడిన వ్యక్తుల అరెస్ట్
- May 15, 2020
ఒమన్:కరోనా వ్యాప్తి నియంత్రణకు భౌతిక దూరం పాటించాలని అధికారులు ఎంతగా చెబుతున్నా..కొందరు జనాలు మాత్రం తీరు మార్చుకోవటం లేదు. ఒమన్ లోని నార్త్ అల్ షర్ఖియా ప్రాంతంలో కొంతమంది భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా ఒకే చోట గుమికూడారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి..న్యాయ విచారణకు కేసును బదిలీ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సుప్రీం కమిటీ పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు మినహా ఇతరులు ఎవరూ ఒకే చోట గుమికూడొద్దని నిబంధనలు విధించింది. అయినా..కొందరు జనం ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో పోలీసులు అలాంటి వారికి కట్టడి చేసే పనిలో ఉన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని, లేకపోతే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







