బహ్రెయిన్:విజిటర్స్ కోసం షిషా ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రంపై చర్యలు
- May 15, 2020
మనామా:లాక్ డౌన్ నిబంధనల సడలింపును దుర్వినియోగం చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. కరోనా ప్రమాదం పొంచి ఉన్నా..తమకు డబ్బు సంపాదించటమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ పర్యాటక కేంద్రాన్ని పోలీసలు మూసివేయించారు. కరోనా నేపథ్యంలో షీషా కల్చర్కు అనుమతి లేకున్నా..వ్యాపారం కోసం పర్యాటకులకు షీషా ఏర్పాటు చేయటమే ఇందుకు కారణం. బహ్రెయిన్ లోని ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటక కేంద్రం నిర్వాహకులు అతిథుల కోసం షీషా ఏర్పాటు చేశారన్న సమాచారంతో పోలీసులు, పర్యాటక మంత్రిత్వ శాక అధికారులు, న్యాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా షీషాను బహ్రెయిన్ ప్రభుత్వం నిషేధం విధించారు. అయినా..నిబంధనలు పట్టించుకోకుండా షీషా కల్చర్ ను ఏర్పాటు చేయటంతో అధికారులు పర్యాటక కేంద్రాన్ని మూసివేయించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







