బహ్రెయిన్:విజిటర్స్ కోసం షిషా ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రంపై చర్యలు
- May 15, 2020
మనామా:లాక్ డౌన్ నిబంధనల సడలింపును దుర్వినియోగం చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. కరోనా ప్రమాదం పొంచి ఉన్నా..తమకు డబ్బు సంపాదించటమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ పర్యాటక కేంద్రాన్ని పోలీసలు మూసివేయించారు. కరోనా నేపథ్యంలో షీషా కల్చర్కు అనుమతి లేకున్నా..వ్యాపారం కోసం పర్యాటకులకు షీషా ఏర్పాటు చేయటమే ఇందుకు కారణం. బహ్రెయిన్ లోని ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటక కేంద్రం నిర్వాహకులు అతిథుల కోసం షీషా ఏర్పాటు చేశారన్న సమాచారంతో పోలీసులు, పర్యాటక మంత్రిత్వ శాక అధికారులు, న్యాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా షీషాను బహ్రెయిన్ ప్రభుత్వం నిషేధం విధించారు. అయినా..నిబంధనలు పట్టించుకోకుండా షీషా కల్చర్ ను ఏర్పాటు చేయటంతో అధికారులు పర్యాటక కేంద్రాన్ని మూసివేయించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







