బహ్రెయిన్:విజిటర్స్‌ కోసం షిషా ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రంపై చర్యలు

- May 15, 2020 , by Maagulf
బహ్రెయిన్:విజిటర్స్‌ కోసం షిషా ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రంపై చర్యలు

మనామా:లాక్‌ డౌన్ నిబంధనల సడలింపును దుర్వినియోగం చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. కరోనా ప్రమాదం పొంచి ఉన్నా..తమకు డబ్బు సంపాదించటమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ పర్యాటక కేంద్రాన్ని పోలీసలు మూసివేయించారు. కరోనా నేపథ్యంలో షీషా కల్చర్‌కు అనుమతి లేకున్నా..వ్యాపారం కోసం పర్యాటకులకు షీషా ఏర్పాటు చేయటమే ఇందుకు కారణం. బహ్రెయిన్‌ లోని ముహర్రఖ్‌ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటక కేంద్రం నిర్వాహకులు అతిథుల కోసం షీషా ఏర్పాటు చేశారన్న సమాచారంతో పోలీసులు, పర్యాటక మంత్రిత్వ శాక అధికారులు, న్యాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా షీషాను బహ్రెయిన్ ప్రభుత్వం నిషేధం విధించారు. అయినా..నిబంధనలు పట్టించుకోకుండా షీషా కల్చర్‌ ను ఏర్పాటు చేయటంతో అధికారులు పర్యాటక కేంద్రాన్ని మూసివేయించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com