దుబాయ్ మెట్రో కొత్త రూల్స్..

- May 15, 2020 , by Maagulf
దుబాయ్ మెట్రో కొత్త రూల్స్..

దుబాయ్: కరోనా మూలంగా విధించిన ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తూ వస్తోంది యూఏఈ. ఈ కోవలోనే దుబాయ్ మెట్రో, ట్రామ్, ఫెర్రీ సర్వీసులను యథాతథం నడుపుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ మెట్రో తాజాగా కొన్ని సూచనలను అందించింది. అదేంటంటే,మెట్రో లిఫ్ట్ లో ఒకేసారి ఇద్దరు మించి ఉపయోగించకూడదు అని దుబాయ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) శుక్రవారం ప్రకటన జారీ చేసింది.

మెట్రో మరియు బస్ స్టేషన్ల యొక్క అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లతో పాటు ప్రజా రవాణా మార్గాలు, టాక్సీ స్టాండ్ల దగ్గర ప్రజలు పాటించాల్సిన సూచనలను ఖఛ్చితంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అవి..

* నో సిట్టింగ్ (పబ్లిక్ ట్రాన్సిట్ మార్గాలు మరియు సౌకర్యాల యొక్క కొన్ని సీట్లలో)
* రెండు రైడర్స్ మాత్రమే (టాక్సీలు మరియు లిమోలలో)
* సురక్షిత దూరాన్ని పాటించాలి (మూసివేసిన ప్రదేశాలలో)
* మాస్క్ ధరించాలి (అన్ని ప్రదేశాలు)
* గ్లోవ్స్ ధరించాలి 
* మెడికల్ శానిటైజర్లు వాడాలి
* చేతులను కడుక్కోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com