మే16 నుంచి స్వదేశానికి యూఏఈలోని భారతీయుల తరలింపు

- May 15, 2020 , by Maagulf
మే16 నుంచి స్వదేశానికి యూఏఈలోని భారతీయుల తరలింపు

యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రెండో దశ చర్యలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.ఇందులో భాగంగా శనివారం నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను నడపనుంది.శనివారం దుబాయ్,అబుధాబి నుంచి మొత్తం మూడు విమానాలు బయల్దేరనున్నాయి.ఓ ఫ్లైట్ దుబాయ్ నుంచి కొచ్చి,మరో రెండు విమానాలు అబుధాబి నుంచి తిరువనంతపురం, కోజికోడ్ వెళ్లనున్నాయి.కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దైన కారణంగా పలు దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.దీంతో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం మే 7 నుంచి వందే భారత్ మిషన్ చేపట్టింది.ఇందులో భాగంగా తొలిదశలో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల్లో కొందర్ని ఇప్పటికే ఇండియా తీసుకురాగా..మే 16 నుంచి రెండో దశ తరలింపు చర్యలు చేపట్టింది.ఈ నెల 23 వరకు రెండో దశ తరలింపు కొనసాగనున్నట్లు దుబాయ్ లోని ఇండియా కాన్సులేట్ కార్యాలయ అధికారులు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com