మే16 నుంచి స్వదేశానికి యూఏఈలోని భారతీయుల తరలింపు
- May 15, 2020
యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రెండో దశ చర్యలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.ఇందులో భాగంగా శనివారం నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను నడపనుంది.శనివారం దుబాయ్,అబుధాబి నుంచి మొత్తం మూడు విమానాలు బయల్దేరనున్నాయి.ఓ ఫ్లైట్ దుబాయ్ నుంచి కొచ్చి,మరో రెండు విమానాలు అబుధాబి నుంచి తిరువనంతపురం, కోజికోడ్ వెళ్లనున్నాయి.కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దైన కారణంగా పలు దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.దీంతో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం మే 7 నుంచి వందే భారత్ మిషన్ చేపట్టింది.ఇందులో భాగంగా తొలిదశలో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల్లో కొందర్ని ఇప్పటికే ఇండియా తీసుకురాగా..మే 16 నుంచి రెండో దశ తరలింపు చర్యలు చేపట్టింది.ఈ నెల 23 వరకు రెండో దశ తరలింపు కొనసాగనున్నట్లు దుబాయ్ లోని ఇండియా కాన్సులేట్ కార్యాలయ అధికారులు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







