భారత్ లో 90,000 దాటిన కరోనా కేసులు

- May 17, 2020 , by Maagulf
భారత్ లో 90,000 దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే వుంది. ఇప్పటికే కేసుల్లో చైనా ను దాటిన భారత్...తాజా కేసులతో 90 వేలు క్రాస్ చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 4,987 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 124 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటి వరకు భారత్లో మొత్తం 90,927 కేసులు నమోదు కాగా, 2,872 కరోనా మరణాలు సంభవించాయి. ఇక 53,946 యాక్టివ్ కేసులు ఉండగా, 34,108 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నేటితో లాక్ డౌన్ 3 ముగుస్తున్న వేళ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ ను సడలిస్తే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు వాతావరణం కూడా చల్లబడింది. దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com