వేసవి సెలవుల వరకు దూరవిద్య కార్యక్రమం పొడిగింపు

- May 17, 2020 , by Maagulf
వేసవి సెలవుల వరకు దూరవిద్య కార్యక్రమం పొడిగింపు

మార్చి సంవత్సరంలో ప్రారంభమైన దూరవిద్య కార్యక్రమం వేసవి సెలవుల వరకు పొడిగించబడింది.

దుబాయ్: వేసవి సెలవుల తర్వాత సెప్టెంబర్‌లో పాఠశాలలు ప్రారంభించనున్నట్లు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) తెలిపింది. 

కరోనా అనిశ్చితి ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలీని ఈ గందరగోళ పరిస్థితిలో KHDA ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు శిక్షణా సంస్థలు తమ విద్యార్థులతో పాఠ్యపుస్తకాలు మినహా ఎలాంటి కాగితపు వస్తువులను మార్పిడి చేయడానికి ప్రస్తుతం అనుమతించబడలేదని అధికారం నొక్కి చెప్పింది. 

దూరవిద్య కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సాగేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సాధనాలతో పాటు, ప్రత్యామ్నాయ వ్యూహాలను మరియు ఆన్‌లైన్ అభ్యాస పద్ధతులను చేర్చాలని ఉపాధ్యాయులకు KHDA సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com