బహ్రెయిన్:క్షమాభిక్ష పొందిన 127 మంది భారతీయులను..స్వదేశానికి తరలింపు

- May 19, 2020 , by Maagulf
బహ్రెయిన్:క్షమాభిక్ష పొందిన 127 మంది భారతీయులను..స్వదేశానికి తరలింపు

బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొందిన వారిలో 127 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. బహ్రెయిన్ నుంచి గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక విమానంలో వారిని కొచ్చికి చేరుకున్నారు. ఇందులో 56 మంది కేరళవాసులు కూడా ఉన్నారు. రెండు దేశాల పరస్పర సహకారంతో పాటు కరోనా నేపథ్యంలో 901 మంది భారతీయులకు బహ్రెయిన్ ప్రభుత్వం గత మార్చిలో క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. మరోవైపు కొచ్చి చేరుకున్న వారి ఇండియన్లను అక్కడి అధికారులు స్థానిక నావల్ ఎయిర్మెన్ స్కూల్ లో నిర్బంధంలో ఉంచారు. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటికి పంపించనున్నారు. జరిమానాలు కూడా చెల్లించలేక జైలులో మగ్గుతున్న ఇండియన్లకు క్షమాభిక్ష ప్రసాదించిన బహ్రెయిన్ ప్రభుత్వానికి..భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీ బహ్రెయిన్ లో పర్యటించిన తర్వాత ఇరు దేశాల మైత్రి బంధం మరింత బలపడిందని...పరస్పర సహకారం మరింత
మెరుగ్గా ఉందని బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం వివరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com