ఒమన్:ఈద్ సంబరాలపై నిషేధం విధించిన సుప్రీం కమిటీ
- May 19, 2020
మస్కట్:ఈద్ సంబరాలపై ఒమన్ సుప్రీం కమిటి నిషేధం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి సమూహంగా సంబరాలు చేసుకున్నా..ఫేస్ మాస్కులు ధరించకపోయినా తగిన శిక్షలతో పాటు జరిమానా విధిస్తామని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. సుప్రీం కమిటి నిర్ణయం మేరకు రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్ధనలు, సామూహిక సంబరాలు నిర్వహించకూడదు. అలాగే పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకోవటంపై కూడా నిషేధం అమలులో ఉంటుంది. సుప్రీం కమిటీ నిర్ణయాలను అమలు చేసేందుకు వ్యక్తులు, పబ్లిక్, ప్రైవేట్ సంస్థలలో అమలు చేసేలా రాయల్ ఒమన్ పోలీసులు ప్రతిక్షణం పర్యవేక్షిస్తూనే ఉంటారు. అంతేకాకుండా ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకొని వారికి జరిమానా విధించే అధికారం కూడా సుప్రీం కమిటీ రాయల్ ఒమన్ పోలీసులకు అప్పగించింది. ఇదిలాఉంటే పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇచ్చే అవకాశాలు ఉండటంతో సుప్రీం కమిటీ నిర్ణయాలను కఠినంగా అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







