తెలంగాణ: కొత్తగా 41 పాజిటివ్ కేసులు
- May 18, 2020
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సోమవారం మరో 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 కేసులు నమోదయ్యాయి. మరో 12 కేసులు వలసదారులకు సంబంధించినవి. కాగా.. తాజాగా మేడ్చల్ జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,593కు చేరింది. అందులో 69 మంది వలసదారులే ఉన్నారు. సోమవారం 10 మంది కోలుకోగా, వారితో కలిపి 1002 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 34 మంది చనిపోగా, ప్రస్తుతం 556 మంది చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







