కరోనా వైరస్: నిబంధనల్ని ఉల్లంఘించిన గ్రూప్ అరెస్ట్
- May 19, 2020
మస్కట్: అల్ బతినా నార్త్ గవర్నరేట్లో పోలీసులు కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీరంతా ఓ గ్రూప్గా ఏర్పడి, ఓ చోట సమావేశమయ్యారు. నిబంధనల్ని ఉల్లంఘించి గ్రూప్గా ఏర్పాటయ్యారనీ, అందుకే వీరిని అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువమంది వ్యక్తులు ఒక చోట గుమికూడటం నేరం. ఈ మేరకు సుప్రీం కమిటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ చేసినవారిని చట్ట పరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







