పసుపుగా వస్తున్న పొగకు బెంబేలెత్తిన విశాఖ ప్రజలు
- May 21, 2020విశాఖ: నగరంలో మళ్లీ కలకలం రేగింది. HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పసుపుగా పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. HPCL రిఫైనరీలోని ఎస్హెచ్యూని తెరిచే సమయంలో ఘటన జరిగింది. ఎలాంటి ప్రమాదం లేదని HPCL వర్గాలు అంటున్నాయి.
ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది చనిపోయారు. పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనలో చిన్నారులు కూడా అస్వస్థకు గురయ్యారు. వీరందరికీ ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కొంతమంది డిస్చార్జ్ అయ్యారు. ఈ ఘటన నుంచి కోలుకోకముందే మళ్ళీ HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా పొగ రావటంతో విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోయారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు