పసుపుగా వస్తున్న పొగకు బెంబేలెత్తిన విశాఖ ప్రజలు
- May 21, 2020విశాఖ: నగరంలో మళ్లీ కలకలం రేగింది. HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పసుపుగా పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. HPCL రిఫైనరీలోని ఎస్హెచ్యూని తెరిచే సమయంలో ఘటన జరిగింది. ఎలాంటి ప్రమాదం లేదని HPCL వర్గాలు అంటున్నాయి.
ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది చనిపోయారు. పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనలో చిన్నారులు కూడా అస్వస్థకు గురయ్యారు. వీరందరికీ ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కొంతమంది డిస్చార్జ్ అయ్యారు. ఈ ఘటన నుంచి కోలుకోకముందే మళ్ళీ HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా పొగ రావటంతో విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోయారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..