రమదాన్ సందర్భంగా ప్రవాస కార్మికులకు 4 లక్షల ఆహార పొట్లాల పంపిణీ
- May 22, 2020
మనామా:బహ్రెయిన్ రాజధాని మనామాలో ప్రవాస కార్మికులకు ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా చేపట్టిన ఫీనా ఖైర్ లో భాగంగా దాదాపు 4 లక్షల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనామా గవర్నర్ షేక్ హిషమ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో భాగంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తము ప్రవాస కార్మికులకు ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ దేశం మానవతా దృక్పధం చాటుతోందన్నారు. బహ్రెయిన్ సమాజంలో భాగమైన విలువలకు ఫీనా ఖైర్ ఓ సంకేతమన్నారు. కష్టాల్లో ఉన్నవారికి తాము సంఘీభావంగా నిలబడతామన్నారు. మరోవైపు కష్టాల్లో ఉన్న వారి ఆకలి బాధ తీర్చేందుకు ఫీనా ఖైర్ చేపట్టాలని ఆదేశించిన జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫాపై గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజధాని ప్రాంతంలో ప్రతి రోజు ఆహార పొట్లాలను అందించేలా స్వసంచ సంస్థలు, వాలంటీర్లు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?