ఖతార్‌లో మాస్క్‌లలో ఈద్‌ ప్రార్థల‌కి అనుమతి లేదు

- May 22, 2020 , by Maagulf
ఖతార్‌లో మాస్క్‌లలో ఈద్‌ ప్రార్థల‌కి అనుమతి లేదు

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ ఎండోవ్‌మెంట్స్‌ అండ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ (అవ్‌కాఫ్‌), కరోనా వైరస్‌ నేపథ్యంలో తాత్కాలికంగా మసీదుల్ని ప్రార్థనల కోసం వినియోగించకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఈద్‌ అల్‌ ఫితర్‌  ప్రార్ధనలు మసీదుల్లో నిర్వహించడానికి వీల్లేనదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 22న జారీ చేసిన స్టేట్‌మెంట్‌కి కట్టుబడి, మసీదుల్లో ప్రార్థనలకు అనుమతించడంలేదని అధికారులు తెలిపారు. ఈద్‌ ప్రార్ధనలు  ఇంట్లోనే నిర్వహించుకోవాల్సి వుంటుందని అధికారులు సూచించారు. ఇమామ్  ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ వహాబ్‌ మాస్క్‌కి చెందిన స్టాఫ్‌ అలాగే ముజ్జిన్స్‌, ఇమామ్స్ సహా 40 మంది వర్షిపర్స్‌తో మాత్రమే జరిగే ప్రత్యేక ప్రార్థనల్ని టీవీ మరియు రేడియో ఛానల్స్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తారు. కాగా, అమిర్‌ షేక్‌ తమీమ్ బిన్‌ హమాద్‌ అల్‌ తని సహా పలువురు ప్రముఖులకు మినిస్ట్రీ ఆఫ్‌ ఎండోవ్‌మెంట్స్‌ అండ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ ప్రత్యేక శుభాకాంక్షలు అందించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com