భారత్ లో పెరిగిన కరోనా కేసులు

- May 23, 2020 , by Maagulf
భారత్ లో పెరిగిన కరోనా కేసులు

భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లోనే 6500 లకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం... గడిచిన 24 గంటల్లో 6,654 మందికి కొత్తగా కరోనా సోకిందని వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,25,101 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లోనే 137 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3,720కి చేరింది. 51,784 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 69,597 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో క్యూర్ అయిన కేసులు 41.3 శాతం ఉండగా... మరణాల శాతం 2.97గా ఉంది.. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 55.6 శాతంగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com