భారత్ లో పెరిగిన కరోనా కేసులు
- May 23, 2020
భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లోనే 6500 లకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం... గడిచిన 24 గంటల్లో 6,654 మందికి కొత్తగా కరోనా సోకిందని వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,25,101 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లోనే 137 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3,720కి చేరింది. 51,784 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 69,597 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో క్యూర్ అయిన కేసులు 41.3 శాతం ఉండగా... మరణాల శాతం 2.97గా ఉంది.. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 55.6 శాతంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







