భారత్ లో పెరుగుతున్నకరోనా కేసులు..
- May 24, 2020
భారత్లో కరోనా రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. గడిచిన 24 గంటల్లో 6767 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కు చేరిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. అటు, గడిచిన 24 గంటల్లో 2,657 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 54,440 చేరింది. మరోవైపు ఒక్కరోజులో దేశవ్యాప్తంగా147 కరోనా మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ మొత్తం 3867 మంది చనిపోయారు. ప్రస్తుతానికి దేశంలో 73,560 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవ్వడంతో అధికారిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







