రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ సినిమాలు సైన్ చేసిన హీరో కార్తిక్ రాజు
- May 26, 2020
పడేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం ఆయిన హీరో కార్తిక్ రాజు కౌసల్య కృష్ణమూర్తి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు సూర్య అశ్విన్ వర్మ అనే నూతన దర్శకుడితో క్రికెట్ నేపథ్యంలో నడిచే ఒక రివేంజ్ డ్రామాలో కార్తిక్ నటించబోతున్నాడు. కథ బలం ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించే ట్విస్టులు ఉండబోతున్నాయి.
సూర్య అశ్విన్ వర్మ సినిమాతో పాటు రజినీకాంత్ యన్న దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు కార్తిక్ రాజు. ఆకట్టుకునే డ్రామాగా ఈ సినిమా ఉండబోతొంది. రజనీకాంత్ యన్న గతంలో డైరెక్టర్ క్రిష్ దగ్గర వర్క్ చేశారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే సినిమా ఇది.
కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో నా నటనకు మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు భీమినేని శ్రీనివాస్, నిర్మాత కెఎస్.రామారావు కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కథ బలం ఉన్న సినిమాలు చెయ్యడానికి నేను ఎప్పుడూ రెడీ, లాక్ డౌన్ తరువాత నా సినిమా చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి. భవిషత్తులో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కార్తిక్ రాజు తెలిపారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!