ఈద్ నాడు అపశృతి..తెలంగాణ వాసి దారుణ హత్య
- May 27, 2020
షార్జా: షార్జాలో ఈద్ రోజున అపశృతి జరిగింది. స్వదేశీయుడిని పొడిచి చంపినందుకు 35 ఏళ్ల భారతీయ ప్రవాసిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేశవేని నవీన్(27) అనే వ్యక్తి ఆరు నెలల క్రితం ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని దేశం కాని దేశం అయిన యూఏఈ వచ్చాడు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఓ కార్ వాషింగ్ సెంటర్లో పనికి కుదిరాడు. కానీ అంతలోనే విధి వక్రించి దారుణ హత్యకు గురయ్యాడు.
అసలేం జరిగిందంటే, పోలీసులు ఈద్ అల్ ఫితర్ ఆనందంలో ఉండగా వచ్చిన ఫోన్ కాల్ తో అప్రమత్తమయ్యారు. నవీన్ తన తోటి కార్మికుడు అయిన 35 ఏళ్ల భారతీయ వాసితో వ్యక్తిగత సమస్యలపై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో నిందితుడు కత్తిని పట్టుకుని, నవీన్ ను పలుసార్లు పొడిచి చంపాడని షార్జా పోలీసులు తెలిపారు. పోలీసులు నేరం జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, నవీన్ చనిపోయినట్లు గుర్తించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించగా, అతన్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్టు తెలిపిన పోలీసులు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







