ఈద్ నాడు అపశృతి..తెలంగాణ వాసి దారుణ హత్య
- May 27, 2020
షార్జా: షార్జాలో ఈద్ రోజున అపశృతి జరిగింది. స్వదేశీయుడిని పొడిచి చంపినందుకు 35 ఏళ్ల భారతీయ ప్రవాసిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేశవేని నవీన్(27) అనే వ్యక్తి ఆరు నెలల క్రితం ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని దేశం కాని దేశం అయిన యూఏఈ వచ్చాడు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఓ కార్ వాషింగ్ సెంటర్లో పనికి కుదిరాడు. కానీ అంతలోనే విధి వక్రించి దారుణ హత్యకు గురయ్యాడు.
అసలేం జరిగిందంటే, పోలీసులు ఈద్ అల్ ఫితర్ ఆనందంలో ఉండగా వచ్చిన ఫోన్ కాల్ తో అప్రమత్తమయ్యారు. నవీన్ తన తోటి కార్మికుడు అయిన 35 ఏళ్ల భారతీయ వాసితో వ్యక్తిగత సమస్యలపై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో నిందితుడు కత్తిని పట్టుకుని, నవీన్ ను పలుసార్లు పొడిచి చంపాడని షార్జా పోలీసులు తెలిపారు. పోలీసులు నేరం జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, నవీన్ చనిపోయినట్లు గుర్తించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించగా, అతన్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్టు తెలిపిన పోలీసులు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







